హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనింగ్ పై రోశయ్య విఫలం: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం అడ్డుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఓబుళాపురం అక్రమ తవ్వకాలకు నిరసనగా ప్రతిపక్షాలు శుక్రవారం హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టాయి.అక్రమ మైనింగ్ ద్వారా ప్రజా సంపద దోపిడీకి గురవుతోందని ఆయన విమర్శించారు. గనుల తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలపై ప్రభుత్వం నివేదికను తెప్పించలేకపోయిందని ఆయన తప్పు పట్టారు.

ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలను నిలిపేసే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. చలో ఓబుళాపురం కార్యక్రమాన్ని చేపడతామని, తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నాయకులు ధర్నాను ప్రారంభించారు. ఈ ధర్నాతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హాజరు కాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X