వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరుకు ధరపై దద్ధరిల్లిన లోకసభ

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: చెరుకు రైతులకు చెల్లించే ధరపై శుక్రవారంనాడు కూడా లోకసభ దద్ధరిల్లింది. చెరుకు రైతులకు చెల్లించే ధరపై ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నానానికి వాయిదా వేశారు. సభ సమావేశం కాగానే ప్రతిపక్షాల సభ్యులు, ముఖ్యంగా బిజెపి సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాలా కానూన్ వాపస్ లో (నల్లచట్టాన్ని ఉపసంహరించుకో) అంటూ ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ మీరా కుమార్ పదే పదే చేసిన విజ్ఞప్తులను ప్రతిపక్షాల సభ్యులు పట్టించుకోలేదుద. దీంతో సభను ఆమె మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. గురువారంనాడు ఢిల్లీలో చెరుకు రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. గురువారంనాడు కూడా చెరుకు రైతుల సమస్యపై లోకసభ అర్థాంతరంగా వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X