వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో గనుల్లో పేలుడు: 15 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

China
బీజింగ్: చైనా ఉత్తర ప్రాంతంలో బొగ్గు గనుల్లో శనివారం గ్యాస్ పేలిపోవడంతో 15 మంది మరణించారు. బొగ్గు గనుల శిథిలాల్లో 114 మంది దాకా చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. దాదాపు 399 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. పేలుడు కారణాలు తెలియరావడం లేదు.

ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఈ గనులు యాజమాన్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. హెగాంగ్ బ్రాంచ్ లో 88 వేల మంది దాకా పనిచేస్తున్నారు. భూగర్భంలో ఈ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని ఆనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X