హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షి బ్లాక్ మెయిల్ చేస్తోంది: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారాల విషయంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య సిగ్గుతో తల వంచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలను ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. అక్రమాలు జరిగాయని కచ్చితంగా తెలిసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు నిర్ణయం రానివ్వండనే పద్ధతిలో రోశయ్య మాట్లాడటం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఓఎంసి అక్రమాలను సుప్రీంకోర్టు చెప్పే వరకు ప్రభుత్వం పట్టించుకోదా అని ఆయన అడిగారు. మైనింగ్ మాఫియాకు కాంగ్రెసు ప్రభుత్వం లొంగిపోయిందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మైనింగ్ లాబీని కాపాడుతున్నారని ఆయన విమర్శించారు. ఓఎంసి అక్రమాలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన అన్నారు. సాక్షి పత్రికలో ఏం రాస్తారని, మమ్మల్ని తప్పు పడుతారా, మేం లొంగిపోవాలా, బ్లాక్ మెయిలర్లుగా తయారై పిచ్చికుక్కల్లా రాస్తారా అని అడిగారు. మీడియాను మొత్తం కొనేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మైనింగ్ అక్రమాలు జరుగుతుంటే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఏం చేస్తున్నారని, బిజెపి నాయకత్వం ఏం చేస్తోందని ఆయన అడిగారు. కర్నాటకలో 50 మంది శాసనసభ్యులను గాలి జనార్దన్ రెడ్డి కూడగడితే బిజెపి నాయకత్వం లొంగిపోయిందని ఆయన విమర్శించారు. యెడ్యూరప్ప కళ్లనీళ్లు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవికే కళంకం తెచ్చారని ఆయన అన్నారు. పది జిల్లాల్లో కేబుల్ నెట్ వర్కు గాలి జనార్దన్ రెడ్డి చేతుల్లో ఉందని, అందర్నీ మైనింగ్ మాఫియా కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X