హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ డబ్బు పంచడానికి వచ్చారంటూ ఆందోళన

By Santaram
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కాన్వాయ్‌లో డబ్బులు పంచడానికి వచ్చారని రహ్మత్‌ నగర్‌లోని శ్రీరాంనగర్‌ చౌరస్తా వద్ద బీజేపీ, ఎంఐఎం నాయకులు ధర్నా నిర్వహించారు. డీఎస్‌ వాహనాన్ని (ఏపీ25 ఎం 4545) అ డ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి వ చ్చారు. డి.శ్రీనివాస్‌ తన పీఏ ఇంట్లో జరిగే శుభకార్యానికి వచ్చారని పోలీసులు తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులుగా ఉన్న డి.శ్రీనివాస్‌ అధికారికంగా వస్తే కారులో నుంచి బయటకు ఎందుకురాలేదని బీజేపీ నాయకులు అన్నారు. ఎంఐఎం నాయకులు సైతం డి.శ్రీనివాస్‌ వాహనంలో డబ్బులు పంచడానికి వచ్చారనే ఆరోపణలు చేశారు.

ఎంఐఎం, బీజేపీ నాయకులు డీఎస్‌ కాన్వాయ్‌ని అడ్డుకొని ఆందోళనకు దిగడంతో శ్రీరాంనగర్‌లో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. స్థానికంగా దుకాణా లను మూసివేశారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముం దు జాగ్రత్తగా జూబ్లీహిల్స్‌ పోలీసులు పెద్దసంఖ్యలో బలగాలన అక్కడ మోహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X