హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నట్లే: ఎవియస్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

AVS Reddy
హైదరాబాద్: ఓటు అమ్ముకుంటే వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నట్లేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవియస్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఉదయం జూబిలీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లుకు డబ్బులు పంచుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈసారి మద్యం పంపిణీ కన్నా డబ్బుల పంపిణీపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, ఓటును అమ్ముకుంటే వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నట్లేనని ఆయన అన్నారు.

ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లూ చేసామని ఆయన చెప్పారు. ఏ విధమైన అవాంఛనీయమైన చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. డబ్బులు పంచడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X