విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ విజయవాడకు సిఎం రోశయ్య ఓకె

By Santaram
|
Google Oneindia TeluguNews

Prakasam Barrage
విజయవాడ: గ్రేటర్‌ విజయవాడకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను వెంటనే తనకు పంపించాలని ముఖ్యమంత్రి కె రోశయ్య ఆదివారం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రేటర్‌ హోదా విషయంలో స్పష్టమైన సంకేతాలు రావటంతో కార్పొరేషన్‌ యంత్రాంగం అందుకు సమాయత్తమైంది.

గ్రేటర్‌ జాబితాలో ఉన్న 15 గ్రామాలు నగరంలో విలీనం అయితే మరో 10 లక్షల జనాభా అదనంగా పెరిగే అవకాశం ఉన్నందున విజయవాడ నగరాభివృద్ధికి జెఎన్‌ఎన్యూఆర్‌ఎం, ప్రపంచబ్యాంకు నిధులు కూడా మంజూరయ్యేందుకు ఎదురుచూస్తున్నాయి. గ్రేటర్‌హోదాను నిలబెట్టుకునేందుకు కార్పొరేషన్‌ నేతృత్వంలో తక్షణం 14 గ్రామపంచాయితీల (దోనె ఆత్కూరు గ్రామం నిడమానూరు పంచాయితీలో ఉంది) అనుమతిని తీసుకోవాల్సి ఉంది. సాధ్యమైనంత తొందరలో ఆయా గ్రామ పంచాయితీల అనుమతి తీసుకుంటే విజయవాడ రూరల్‌, పెనమలూరు మండలాలలోని గ్రామాలు విజయవాడలో అంతర్భాగం కానున్నాయి.

విజయవాడ రూరల్‌ మండలంలోని నున్న, పాతపాడు, పి నైనవైరం, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి, రామవరప్పాడు, ప్రసాదం పాడు, ఎనికేపాడు, నిడమానూరు, దోనె ఆత్కూరు, పెనమలూరు మండలంలోని యనమల కుదురు, తాడిగడప, కానూరు, పోరంకి గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం అవుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X