వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాహారం, 30 మంది హాస్టల్ బాలికల అస్వస్ధత

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari
రాజమండ్రి: స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో నిల్వ ఆహారం తినడంతో 30 మంది విద్యార్థినులు సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యా రు. వారిని తాళ్లరేవు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలి పారు. ఉదయం వండిన అన్నం, కూరలనే రాత్రి కూడా వడ్డించడంతో 30 మందికి వాంతులు, విరేచనాలయ్యా యి. విషయం తెలిసిన స్థానిక ప్రజాప్రతినిధులు 108లో తాళ్లరేవు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సతో 20 మంది కోలుకోవడంతో తిరిగి హాస్టల్‌కు పంపించారు.

సంగాడి భయ్యేశ్వరి, దంగేటి దుర్గాభవాని, శీలం లావణ్య, తణుకు సూర్యావతి, బళ్లా బాగ్యలకి, పెండెం అల, కాలాడి సత్య, జనుపల్లి విజయదుర్గ, శీలం రమ్య, కాలాడి వీరలకిల పరిస్థితి ఆందోళనకరంగా ఉం దని వైద్యాధికారి శ్రీనివాస్‌నాయక్‌ తెలిపారు. వారికి ఆస్పత్రిలో సెలైన్‌ ఎక్కించి చికిత్స చేస్తున్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, జెడ్పీటీసీ రెడ్డి మురళీమోహన్‌రావు, ఎంపీపీ అరదాడి కృష్ణకుమా రి, సోషల్‌ వెల్ఫేర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జి.నాగేశ్వరరావు వారిని పరామర్శించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X