వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుఖోయ్ లో ఎగిరిన ప్రతిభా పాటిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
పూణే: భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ ప్రతిభా పాటిల్ బుధవారంనాడు సుఖోయ్ 30 ఎంకెఎల్ ఫైటర్ జెట్ లో ప్రయాణించారు. రాష్ట్రపతి యుద్ధ విమానాన్ని రీనో స్క్వాడ్రన్ వింగ్ కమాండర్ ఎస్ సాజన్ కమాండ్ చేశారు. పూణేలోని లోహెగావ్ ఎయిర్ బేస్ నుంచి ఈ విమానం గాలిలోకి ఎగిరింది.

యుద్ధ విమానం గంటకు 700 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 1,100 కిలోమీటర్ల సూపర్ సోనిక్ మార్కును ఇది తాకదు. రాష్ట్రపతి కోసం స్పెషల్ జి. షూట్ ను ఏర్పాటు చేశారు. ఇది భూమ్యాకర్షణ శక్తి ఒత్తిడిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి వీలుంటుంది. దాని వల్ల మెదడుకు మోతాదుకు మించిన రక్తం ప్రవహించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల అతి పెద్ద వయస్సు మహిళ. దీని కోసం ప్రతిభా పాటిల్ మూడు నెలల పాటు సిద్ధమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X