ఎట్టకేలకు రేపు సిఎల్పీ సమావేశం
రేపటి సిఎల్పీ సమావేశానికి పార్టీ అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ హాజరయ్యే అవకాశం ఉంది. పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థి ఖరారు వంటి ప్రధాన విషయంలో కూడా వైయస్ జగన్ తమ దారికి రావడంతో పార్టీ అధిష్టానం సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ శాసనసభా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రోశయ్య ఎమ్మెల్సీ కావడంతో శాసనసభా పక్ష నేతగా శాసనసభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ పదవికి బొత్సా సత్యనారాయణ వంటి పలువురు నాయకులు పోటీ పడుతున్నారు.
Comments
Story first published: Thursday, November 26, 2009, 13:58 [IST]