హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎట్టకేలకు రేపు సిఎల్పీ సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: ఎట్టకేలకు రేపు శుక్రవారం కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సిఎల్పీ సమావేశం జరగలేదు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ఆందోళనా స్థాయికి చేరడంతో సిఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా కాంగ్రెసు పార్టీ సాహసించలేదు. రేపటి సమావేశంలో తమ నేతగా ముఖ్యమంత్రి కె. రోశయ్యను ఎన్నుకుంటారు.

రేపటి సిఎల్పీ సమావేశానికి పార్టీ అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ హాజరయ్యే అవకాశం ఉంది. పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థి ఖరారు వంటి ప్రధాన విషయంలో కూడా వైయస్ జగన్ తమ దారికి రావడంతో పార్టీ అధిష్టానం సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ శాసనసభా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రోశయ్య ఎమ్మెల్సీ కావడంతో శాసనసభా పక్ష నేతగా శాసనసభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ పదవికి బొత్సా సత్యనారాయణ వంటి పలువురు నాయకులు పోటీ పడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X