హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎల్పీ నేతగా రోశయ్య ఏకగ్రీవ ఎన్నిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేతగా కె. రోశయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ మీడియా ప్రతినిధులకు చెప్పారు. సిఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ 150 మంది శాసనసభ్యులు, 49 మంది ఎమ్మెల్సీలు, 29 మంది పార్లమెంటు సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ సోనియాకు చెప్పారు. దాంతో ఆమె రోశయ్య ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాన్ని ప్రణబ్ ముఖర్జీ అధికారికంగా ప్రకటించారు.

నాటకీయంగా జరిగిన పరిణామాల మధ్య ఎట్టకేలకు సిఎల్పీ సమావేశం జరిగింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు వీరప్ప మొయిలీ సిఎల్పీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సమావేశం తొలుత సంతాపం ప్రకటించింది. ఆ తర్వాత వరద మృతులకు సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేశారు. ఆ తర్వాత సిఎల్పీ నేత ఎంపిక జరిగింది. సిఎల్పీ నేత ఎంపిక విషయాన్ని సోనియాకు అప్పగిస్తూ వైయస్ జగన్ తీర్మానం ప్రతిపాదించారు. సిఎల్పీ సమావేశానికి పార్లమెంటు సభ్యులు కె.కేశవరావు, వి.హనుమంతరావు, మధు యాష్కీ గౌడ్ దూరంగా ఉన్నారు. శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కాస్తా ఆలస్యంగా వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X