వరద బాధితులకు ఎన్నారై సంస్ధ సాయం
ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని రవికాంత్ గార్లపాటి చక్కని సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. మధుమోహన్, రాజశేఖర్, శ్రీధర్ ఐతా, కిశోర్, సురేష్ తమ సహాయ సహకారాలు అందించారు. వరదల్లో ఎక్కువగా నష్టపోయిన కుటుంబాలను గుర్తించడంలోనూ, వాటిలో మళ్ళీ అత్యధికంగా కష్టాలు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఎంపిక చేయడంలోనూ రవికాంత్ బృందం క్షేత్ర స్థాయిలో విశేషంగా కృషి చేసింది. బాధిత కుటుంబాల ఎంపిలో కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేశ్, సుధాకర్, మధు, రాజశేఖర్, తదితరులు సహాయ సహకారాలు అందించారు. ఆర్థిక సహాయం పంపిణీకి ఎంపికైన బాధిత కుటుంబాలకు ముందుగానే కమిటీ సభ్యులు టోకెన్లు పంపిణీ చేశారు. సహాయం పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లలో వాసవీ ఆలయం కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్ చక్కని తోడ్పాటు అందించారు. వరద బాధితులకు సహాయం అందించే విషయంలో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 25 వరకూ ప్రతి విషయాన్నీ ఎన్నారై విఎ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ గార్లపాటి చక్కగా సమన్వయం చేశారు.