హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్సు దూసుకెళ్లి నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ లోని అంబర్ పేటలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉప్పల్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్నఆరు బైకులపైకి దూసుకెళ్లింది. పక్కన నిలబడిన యువకుల మీదికి కూడా దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. చివరికి బస్సు గోడకు ఢీకొట్టి ఆగిపోయింది.

బస్సు ప్రమాదంతో అంబర్ పేటలోని చేనెంబర్ బస్ స్టాప్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్సుపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సు డ్రైవర్ వెంటనే పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. బస్సు బ్రేకులు విఫలం కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X