వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ తీరంలో సింగపూరు సంస్ధ ఓడరేవు

By Santaram
|
Google Oneindia TeluguNews

Kakinada Port
న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన సెంబ్‌ వాంగ్‌ షిప్‌ యార్డ్‌ కాకినాడసీపోర్ట్స్‌ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తంగా కాకినాడ సమీప తీరంలో ఒక ఓడరేవును నిర్మించనున్నట్లు ప్రకటించింది. సెంబ్‌ మెరైన్‌ కాకినాడ సీపోర్ట్‌ లిమిటెడ్‌ (ఎస్‌కెఎల్‌) పేరుతో కృష్ణా గోదావరి బేసిన్‌ ప్రాంతంలో 37.5 కోట్ల డాలర్ల పెట్టుబడితో వచ్చే 3-5 సంవత్సరాల కాలంలో ఈ ఓడరేవును నిర్మించనున్నట్లు సెంబ్‌ కార్ప్‌ మెరైన్‌ డిప్యూటీ ప్రెసిడెంట్‌ సెంబ్‌ వాంగ్‌ షిప్‌ యార్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఓంగ్‌ ఫూకీ పేర్కొన్నారు.

కేజీ బేసిన్‌ ప్రాంతంలో జరుగుతున్న భారీ ఆయిల్‌, గ్యాస్‌ వెలికితీత కార్యక్రమాలు ఇతర కార్యకలాపాల కారణంగా ఈ ప్రాంతంలో షిప్పింగ్‌ వ్యాపారం పెద్ద ఎత్తున పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్బంగా వ్యక్తం చేశారు. ఎస్‌కెఎల్‌ జాయింట్‌ వెంచర్‌లో సెంబ్‌ కార్ప్‌మెరైన్‌ తొలివిడతగా 5 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి 19.9 శాతం వాటాను తీసుకుంటుందని, తమ వాటాను 40 శాతం వరకు పెంచుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటామని ఫూకీ తెలిపారు.

ఈ ప్రతిపాదిత ఓడరేవులో వివిధ రకాల ఓడలకు మరమ్మతులు చేసే సౌకర్యంతో పాటు కొత్త వెసెల్స్‌, షిప్స్‌ నిర్మాణానికి కావలసిన వసతులను కూడా ఏర్పాటు చేస్తామని ఎస్‌కె ఎల్‌ డైరెక్టర్‌ క్రిస్‌ కె. నిట్టల తెలిపారు.మన దేశానికి చెందిన ఓడలు ప్రస్తుతం మరమ్మతుల కోసం సింగపూర్‌కు వెళుతున్నాయని, ఇందుకు గాను 20 లక్షల డాలర్ల నుంచి 2 కోట్ల డాలర్ల వరకు వ్యయం అవుతుందని, ఈ రకమైన వ్యాపారం ఎస్‌కెఎల్‌కు మళ్లే అవకాశం ఉందని నిట్టల తెలిపారు. విశాఖ పట్నం- చెన్నయ్‌ ఓడరేవుల మధ్య అత్యంత కీలకమైన ప్రాంతంలో ఎస్‌కెఎల్‌ పోర్టును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X