తల్లి చావుకు కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజినీరు
వివాహాన్ని ఘనంగా నిర్వహించడానికి అనకాపల్లిలో కళ్యాణ మండపాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ తరుణంలో శ్రీ కాంత్ పెండ్లి శుభలేఖలు ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్లాడు. గురువారం తల్లి దండ్రులకు ఫోన్ చేసి తనకు ఈ పెళ్ళి ఇష్టంలేదని శ్రీకాంత్ చెప్పడంతో ఒక్కసారిగా ఆ దంపతులు షాక్కు గురయ్యారు. పెళ్ళి కుమారుడు తీసుకున్న నిర్ణయంతో అవమాన భారాన్ని తట్టుకోలేక తల్లడిల్లిన తండ్రి వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను విశాఖ కె.జి.హెచ్కు తరలిం చారు.ప్రస్తుతం ఆయన మృత్యువుతో పోరాడుతున్నాడు.తల్లి సులోచన కూడా కుమారుని నిర్ణయం తట్టుకోలేక సమీప వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర్లు పరిస్థితిని చూసి బంధువర్గం దుఖఃసాగరంలో మునిగిపోయింది. గురువారం సాయంత్రం నూతి నుండి సులోచన మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు.