కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ 1న విజయలక్ష్మి నామినేషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి డిసెంబర్ 1వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ల పర్వం మొదలైనప్పటికీ ఇప్పటి వరకు పులివెందులలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. విజయలక్ష్మికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) బి ఫారమ్ ఇచ్చింది. విజయలక్ష్మి తరఫున రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు సహాయకుడు బి ఫారమ్ అందుకున్నారు.

రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందులకు ఉప ఎన్నిక అవసరమైంది. వచ్చే నెల 19వ తేదీన పువివెందుల ఎన్నిక జరుగుతోంది. పులివెందుల నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పోటీ చేయాలని ఆశించారు. అయితే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ సతీమణి విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. పులివెందుల నుంచి పోటీ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీతో సహా ఇతర రాజకీయ పార్టీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X