హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో టీఅర్ ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

By Santaram
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: టీఅర్ ఎస్ అధినేత కేసీఆర్‌ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ చౌరస్తాలో తెరాస కార్యకర్త ఒకరు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. నాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద తెరాస కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. జంటనగరాల్లో పలుచోట్ల వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

కేసీఆర్‌ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ జంటనగరాల్లో తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మలక్‌పేటలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో మలక్‌పేటలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మలక్‌పేట చౌరస్తాలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించడంతో వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఫలక్‌నామా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు తెరాస కార్యకర్తలు రాళ్లురువ్వి ధ్వంసం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X