విజ్ఞాన్ విద్యాసంస్ధల బస్సుకు నిప్పు
సికింద్రాబాద్ వద్ద బంద్ హింసాత్మకంగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో లోకల్ ట్రయిన్ పైకి ఎక్కిన ఓ వ్యక్తి హెటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు. దీంతో నిప్పు రవ్వలు చెలరేగటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని టీఆర్ఎస్ కార్యకర్తగా భావిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Comments
hyderabad హైదరాబాద్ telangana తెలంగాణ k chandrasekhar rao బస్సు కె చంద్రశేఖర రావు ఆందోళన agitation దగ్ధం
Story first published: Monday, November 30, 2009, 9:46 [IST]