వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ జిల్లాలో రైల్ రోకో, లాఠీచార్జి

By Santaram
|
Google Oneindia TeluguNews

వరంగల్: పోరుగల్లు అయిన వరంగల్ జిల్లాలో లాఠీచార్జి, రైల్ రోకో వంటి ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. వరంగల్‌ జిల్లా కాజీపేట్‌లో సోమవారం ఉదయం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రైల్‌ రోకో నిర్వహించారు. కృష్ణా, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేస్తూ ఆందోళన జరిపారు. ముఖ్యమంత్రి రోశయ్య దిష్టిబొమ్మను తగులబెట్టారు.

అలాగే జిల్లాలోని పలు విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులనెదుర్కొంటున్నారు. మొత్తంమీద జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది.

కాకతీయ విశ్వవిద్యాలయంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్దులపై పోలీసులు లాఠీచార్జీ చేయడంతో క్యాంపస్‌లో గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఈ లాఠీచార్జ్‌ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X