ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ను తప్పు పట్టను: పురుషోత్తమ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Purushotham Reddy
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేపట్టిన ఉద్యమాన్ని తాను తప్పు పట్టబోనని కాంగ్రెసు సీనియర్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. కెసిఆర్ తన ఆమరణ నిరాహార దీక్షను మధ్యలోనే నిలిపివేయడాన్ని కూడా తాను పట్టబోనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ శారీరక శక్తి అంతంత మాత్రమేనని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా ఎగిసిందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఉద్యోగులు తెలంగాణ కోసం ఉద్యమించాలని ఆయన పిలువునిచ్చారు. కెసిఆర్ సోమవారం రాత్రి దీక్ష విరమించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను దీక్ష విరమించలేదని కెసిఆర్ స్వయంగా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X