వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నవరంలో రోశయ్య కుమారుడికి ఆలయ మర్యాదలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Annavaram Temple
అన్నవరం: ఆయన ముఖ్యమంత్రి కుమారుడే కానీ జగన్ అంత పాపులర్ కాదు. ఆయన ఎక్కడ ఉంటారో చాలా కొద్ది మందికి తెలుసు. ఆయనే కొత్త ముఖ్యమంత్రి రోశయ్య కుమారుడు కె.సుబ్బారావు. ఆయన సోమవారం అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. ఆయన వస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు దేవస్థానం అధికారులకు ఫోన్‌ ద్వారా తెలియజేసేందుకు ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎంతసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

చివరకు నేరుగా అన్నవరం విచ్చేసి సత్యదేవుని దర్శనార్థం స్వామివారి ప్రధానాలయంలోకి ప్రవేశానంతరం విషయం తెలుసుకున్న దేవస్థానం ఇఓ రామచంద్రమోహన్‌ హడావిడిగా వచ్చి ఆయనను కలుసుకుని అనంతరం దర్శనానికి తీసుకెళ్లారు.ఆయన వెంట గొల్లపల్లి గంగాధరరావు,మొగలి సీతారామస్వామి,పోల్నాటి మాణిక్యాలరావు,బిజెపి రామకృష్ణంరాజు,ఎంఎస్‌ఆర్‌ స్వామి తదితరులున్నారు.ఆయనకు దేవస్దానం అధికారులు దామెర కృష్ణారావు, సూపరిండెంట్‌ సత్తెబ్బాయి,గంటా విష్ణు తదితరులు స్వాగతం పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X