వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వీరయ్య చౌదరి తల తెస్తే కోటి ఇస్తామన్నారు'

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna District
జగ్గయ్యపేట: నవాబుపేటకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గింజుపల్లి వీరయ్య చౌదరి హత్య చేసి తల తీసుకువస్తే రూ. కోటి ఇస్తానని ఆలూరి బుచ్చయ్య చౌదరి కుమార్తె కాకర్ల శాంతి ఎర చూపినట్లు దర్యాప్తులో తేలిందని నందిగామ డీఎస్పీ పీ సాంబయ్య చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వీరయ్యను హత్య చేసినవారికి సొమ్ము చెల్లించేందుకు నవాబుపేటలోని తన తండ్రికి చెందిన నాలుగు ఎకరాల పొలాన్ని కూడా అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఈ హత్యకేసులో ఇప్పటివరకు 17మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మిగిలిన నిందితులైన కాకర్ల శాంతి, ఆమె భర్త రామకృష్ణ, టీడీపీ నేత మల్లెల గాంధీ, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సోదరుడు శ్రీరాం ధనుంజయను అరెస్ట్‌ చేయాల్సి ఉందన్నారు.

ప్రస్తుతం వీరికోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. వీరు అరెస్టు కాని పక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని తెలిపారు. ఇందుకోసం సంబంధిత పత్రాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు ఆయన తెలిపారు. మండలంలోని మక్కపేట, వత్సవాయి గ్రామాల సమీపంలో గల వేబ్రిడ్జ్‌ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమిస్తున్నట్లు చెప్పారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, ట్రాక్టర్లకు లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేయడం వంటి వాటికి పాల్పడేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గత అక్టోబర్‌ ఎనిమిదోతేదీన లింగాల కాజువే వద్ద మామిడి తోటలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మార్కపూడి పద్మ కేసులో నిందితులను కూడా త్వరలోనే పట్టుకోనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐ బొమ్ము సాంబ శివుడు, ఎస్సై పీ ప్రసాదరావు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X