వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'వీరయ్య చౌదరి తల తెస్తే కోటి ఇస్తామన్నారు'
ప్రస్తుతం వీరికోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. వీరు అరెస్టు కాని పక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని తెలిపారు. ఇందుకోసం సంబంధిత పత్రాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు ఆయన తెలిపారు. మండలంలోని మక్కపేట, వత్సవాయి గ్రామాల సమీపంలో గల వేబ్రిడ్జ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమిస్తున్నట్లు చెప్పారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, ట్రాక్టర్లకు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడం వంటి వాటికి పాల్పడేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గత అక్టోబర్ ఎనిమిదోతేదీన లింగాల కాజువే వద్ద మామిడి తోటలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మార్కపూడి పద్మ కేసులో నిందితులను కూడా త్వరలోనే పట్టుకోనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐ బొమ్ము సాంబ శివుడు, ఎస్సై పీ ప్రసాదరావు పాల్గొన్నారు.
Comments
Story first published: Wednesday, December 2, 2009, 11:23 [IST]