కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులివెందుల నుంచి విజయలక్ష్మి ఎన్నిక

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayalakshmi
కడప: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులివెందుల నియోజకవర్గానికి బుధవారం సాయంత్రానికి విజయలక్ష్మి నామినేషన్ ఒక్కటే దాఖలైంది. నామినేషన్ల దాఖలుకు బుధవారం సాయంత్రంతో గడువు ముగిసింది. మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నామినేషన్ల గడువు ముగిసిన వెంటనే కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ బెంగుళూర్ కు వెళ్లారు. తల్లితో పాటు ఆయన బెంగుళూర్ నుంచి పులివెందులకు వచ్చారు. విజయలక్ష్మి నామినేషన్ ను ఆయన దగ్గరుండి వేయించారు. ఈ సందర్భంగా పులివెందులలో భారీ సభను కూడా ఏర్పాటు చేశారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 5వ తేదీ. వైయస్ విజయలక్ష్మి ఎన్నికైనట్లు అదే రోజు అధికారికంగా ప్రకటిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X