వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి గనులపై ప్రధాని కదలాలి: చంద్రబాబు నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైన్స్ కంపెనీపై చర్యలకు ప్రధాని మన్మోహన్ సింగ్ ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఓబుళాపురంపై జాతీయ స్థాయిలో పోరుకు మద్దతు కూడగట్టడానికి ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఓబుళాపురం మైన్స్ కంపెనీ అక్రమాలపై చర్చించేందుకు ప్రధాని అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఓబుళాపురం గనుల అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.

ఓబుళాపురం మైన్స్ కంపెనీపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అప్పగించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. సిబిఐ దర్యాప్తునకు కేంద్రానికి రాశామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారని, కానీ ఇంకా సిబిఐ దర్యాప్తు ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. మైనింగ్ మాఫియా డబ్బుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తమ ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం లీజులు రద్దు చేసిందని, ముడి ఇనుమును స్వాధీనం చేసుకుందని, అంతకు మించి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. గురువారంనాడు ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలాతో మాట్లాడారు. ఫరూఖ్ అబ్దుల్లాతో కూడా ఆయన సమావేశమయ్యారు. మైనింగ్ మాఫియాపై పోరుకు సహకరిస్తానని, చంద్రబాబు కృషి ప్రశంసనీయమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X