వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్థరాత్రి కె చంద్రశేఖర రావు తరలింపులో హైడ్రామా

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదారాబాద్: అత్యంత నాటకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఖమ్మం ప్రభుత్వాస్పత్రి నుంచి హైదరాబాదులోని నిమ్స్ కు తరలించారు. ఈ సందర్భంగా హై డ్రామా చేసుకుంది. కెసిఆర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించడంతో కెసిఆర్ ను నిమ్స్ తరలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కెసిఆర్ తరలిస్తారనే వార్త పొక్కడంతో దాని కోసం మీడియా ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్ద కాచుకుని కూర్చుకుంది. అయితే మీడియా కంట పడకుండా కెసిఆర్ తరలించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు.

బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి నుంచి హైదరాబాదుకు తరలించింది. ఈ వాహనాన్ని మీడియా వెంబడించినా దృశ్యాలను పట్టుకోవడంలో విఫలమైంది. తాను అరెస్టయిన మరుక్షణం నుంచి హైదరాబాదుకు తరలించాలని కెసిఆర్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. హైదరాబాద్ కు తరలించాలనే తన సూచనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యక్తిగత వైద్యుడు గోపీనాథ్ తప్పుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో కెసిఆర్ తో మాట్లాడడానికి ప్రయత్నించారు. అయితే మర్యాదపూర్వకంగా కెసిఆర్ వెంకటరెడ్డితో మాట్లాడారు తప్ప చర్చలకు అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని కెసిఆర్ చెప్పారు. అయితే, వెలుపలికి వచ్చిన మంత్రి కెసిఆర్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని కితాబు ఇచ్చారు. కెసిఆర్ తానే స్వయంగా పండ్ల రసం తీసుకుని దీక్ష విరమించారని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X