హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేయర్ మార్పు: కార్తికా రెడ్డి ఖరారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి కాంగ్రెసు పార్టీ తన అభ్యర్థిని మార్చింది. తొలుత సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పేరును తాత్కాలికంగా ఖరారు చేసిన కాంగ్రెసు నాయకత్వం తర్వాత తన మనసు మార్చుకుని మహిళా కార్పొరేటర్ కు తొలి మేయర్ గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో తార్నాకా కార్పొరేటర్ కార్తికారెడ్డిని ఆ అవకాశం వరించింది. పార్టీ అధిష్టానం మేరకు కార్తికారెడ్డిని మేయర్ పదవికి ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

మేయర్ పదవికి బిసికి ఇవ్వాలనే అభిప్రాయం తొలుత వ్యక్తమైంది. ఈ విషయంపై తీవ్రంగానే చర్చ జరిగింది. అయితే తర్వాతి కాలంలో ఆ పదవి రిజర్వ్ అవుతున్నందున ఓసిలకు అవకాశం రావడానికి 20 ఏళ్లు పడుతుందని, దీనివల్ల ప్రస్తుతం ఓసిలకు అవకాశం ఇవ్వడం మంచిదనే అభిప్రాయానికి బలం చేకూరింది. దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ తొలి మేయరుగా మహిళకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయానికి బలం చేకూరింది. డిప్యూటీ మేయర్ గా మజ్లీస్ కు చెందిన మేరాజ్ హుస్సేన్ పేరు ఖరారైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X