హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ లో ఎమ్మెస్సార్ ఇల్లు ముట్టడి

By Pratap
|
Google Oneindia TeluguNews

M Satyanarayana Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు ఇంటిని విద్యార్థులు శనివారం ముట్టడించారు. ఆందోళనకారులు జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ కోసం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఒత్తిడి తేవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా తెరాస కార్యకర్తలు, విద్యార్థులు కాంగ్రెసు నాయకుల ఇళ్లను ముట్టడించి తెలంగాణ కోసం ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే.

హైదరాబాదులోని మలక్ పేటలోని ఎల్బీ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డిని శనివారం ఉదయం తెలంగాణ విద్యార్థులు ముట్టడించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, హైదరాబాదులోని మల్కాజిగిరి కాంగ్రెసు శాసనసభ్యుడు ఆకుల రాజేందర్ ఇంటిని కూడా విద్యార్థులు ముట్టడించారు. ఈ తాజా పరిణామంతో ప్రభుత్వం అధికార కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను పెంచింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X