గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Andhra Pradesh
గుంటూరు: తెలంగాణ ఉద్యమకారులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలోపు ప్రత్యేక ఆంధ్రను ప్రకటించాలని ఆంధ్ర రాష్ట్ర కమిటి వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యారెడ్డి డిమాండ్‌ చేశారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడిన సత్యారెడ్డి, ఆంధ్రుల జోలికి వ స్తే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రత్యేకాంధ్ర ఉద్యమంపై మాజీ మంత్రి, ఆప్కాబ్ చైర్మన్ వసంత నాగేశ్వరరావు మొన్న ప్రకటించినప్పటి నుంచి క్రమంగా ఆంధ్ర ప్రాంతంలో వేడి రాజుకుంటున్నట్టు కన్పిస్తోంది.

ఆప్కాబ్‌ చైర్మన్‌, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు ప్రత్యేక ఆంధ్ర సాధనకు ఉద్యమం చేపడతానని గురువారం చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులను కూడదీసుకుని ఏఐసీసీ చైర్మన్‌ సోనియాగాంధీని కలసి రాష్ట్ర విభజన ఆవశ్యకతను వివరిస్తానని వసంత పేర్కొన్నారు. వసంత ప్రకటన పట్ల తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేసినా, ఆంధ్ర నేతల స్పందన ఇంకా స్పష్టం కాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X