హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్స్ లో కెసీఆర్ కు డిఎస్, సబిత పరామర్శ

By Santaram
|
Google Oneindia TeluguNews

D Srinivasa Rao
: ఆమరణ నిరాహారదీక్షలో ఉన్న కేసీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. తెలంగాణ అంశాన్ని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వివరిస్తానని డిఎస్ కేసీఆర్‌కు చెప్పారు. తెలంగాణపై సోనియా స్పష్టమైన ప్రకటన చేస్తే తాను దీక్ష విరమిస్తానని కేసీఆర్‌ చెప్పినట్టు సమాచారం.

నిరాహారదీక్షలో ఉన్న తెరాస అధినేత చంద్రశేఖరరావును రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు హోంమంత్రి రాకను నిరసిస్తూ తెరాస కార్యకర్తలు హోంమంత్రి గోబ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రితో పాటు తెలంగాణకు చెందిన మంత్రులు కేసీఆర్‌ను పరామర్శించేందుకు నిమ్స్‌కు రావడంతో పోలీసులు గట్టిభద్రత కల్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X