వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ దీక్ష విరమించాలి: మనీష్ తివారి

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ: దీక్ష విరమించాలని కాంగ్రెసు అధికార ప్రతినిధి మనీష్ తివారీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యపై విస్తృత ప్రాతిపదికపై జాతీయ దృక్పథంతో ఆలోచించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉప ప్రాంతం కోణంలో దాన్ని చూడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఉద్రిక్తతలు పెంచవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషమ పరిస్థితిలో రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కాగా, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. కెసిఆర్ దీక్షను సమీక్షించే బాధ్యతను సోనియా అహ్మద్ పటేల్ కు అప్పగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X