వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైశ్యుల క్షీరాభిషేకం

By Santaram
|
Google Oneindia TeluguNews

Potti Sriramulu
కాకినాడ: అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్యసంఘాల ప్రతిని ధులు ఆదివారం కాకినాడలో పాలాభి షేకం చేశారు. తెలంగాణా ప్రాంతంలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనపై వారు తీవ్రంగా స్పందించారు. రామారావుపేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య మహాసభ, యంగ్‌ మెన్స్‌ వైశ్య అసోసియేషన్‌ సభ్యులు పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పి.బంగారం మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు తప్పుకాదని, అయితే ప్రజల కోసం ప్రాణాలర్పించిన నాయకుల స్మృతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదన్నారు.

ఆర్యవైశ్య మహాసభ కాకినాడ అర్బన్‌ అధ్యక్షుడు గొల్లపూడి బాబ్జి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని రాజకీయాల పేరుతో అవమానపర్చడం క్షమార్హం కాదన్నారు. యంగ్‌మెన్స్‌ వైశ్య అసోసియేషన్‌ అధ్యక్షుడు చిట్టూరి సుందరేశ్వరరావు, అవోగా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకులు డాక్టర్‌ బాదం బాలకృష్ణ, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు ఎల్‌.కృష్ణమూర్తి, వాడకట్టు నాగబాబు, గ్రంధి సీతయ్య, చిట్టూరి సుబ్రహ్మణ్యం, గ్రంధి బాబ్జి పాల్గొన్నారు. వైశ్యులతో పాటు ఇతర వర్గానికి చెందిన వారు కూడా హాజరై తెలంగాణ ఘటనను తీవ్రంగా ఖండించారు.

తెలంగాణా ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను అవమానపరచినందుకు నిరసనగా ఆదివారం ఏలేశ్వరం పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమానికి తూర్పు కాపు విద్యావైజ్ఞానిక అభివృద్ధి సంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం వహించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X