వేలాది మంది భవానీ భక్తులతో దుర్గ గుడి కిటకిట
నేటి నుంచి ప్రారంభమయ్యే దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు దుర్గ గుడి అధికారులు తెలిపారు. తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై దుర్గగుడి మీదుగా వెళ్లే ట్రాఫిక్ను పూర్తిగా మళ్లించారు. సుమారు 10 లక్షల మంది భక్తులు దీక్షలు విరమిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12 వరకు లక్షలాదిగా ఇంద్రకీలాద్రికి భక్తులు తరలిరానున్నారు.
భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రోజులు 2000 కిలోల పులిహోర తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం కాంట్రాక్టు లేబర్ ను వందల సంఖ్యలో నియమించారు.
Comments
Story first published: Tuesday, December 8, 2009, 9:18 [IST]