విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేలాది మంది భవానీ భక్తులతో దుర్గ గుడి కిటకిట

By Santaram
|
Google Oneindia TeluguNews

Kanakadurga Temple
విజయవాడ: నలభై ఒక్క రోజుల దీక్ష చేపట్టిన భవానీ భక్తులు ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఇరుముడులు సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అర్జునవీధి, జమ్మిదొడ్డి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 8 గంటలకు రెండు హోమగుండాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి 11 వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు.

నేటి నుంచి ప్రారంభమయ్యే దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు దుర్గ గుడి అధికారులు తెలిపారు. తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై దుర్గగుడి మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించారు. సుమారు 10 లక్షల మంది భక్తులు దీక్షలు విరమిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12 వరకు లక్షలాదిగా ఇంద్రకీలాద్రికి భక్తులు తరలిరానున్నారు.

భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రోజులు 2000 కిలోల పులిహోర తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం కాంట్రాక్టు లేబర్ ను వందల సంఖ్యలో నియమించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X