హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ కు జై ఆంధ్రా నేత వసంత పరామర్శ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vasantha Nageswara Rao
హైదరాబాద్: హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును జై ఆంధ్ర నేత వసంత నాగేశ్వర రావు మంగళవారం పరామర్శించారు. జై తెలంగాణ నినాదాలు చేయాలని నిమ్స్ వద్ద ఉన్న తెరాస కార్యకర్తలు ఆయనను కోరారు. జై ఆంధ్రా అంటే ఏమిటి, తెలంగాణ ఏర్పడాలనే కదా అని ఆయన వారికి సున్నితంగా సమాధానమిచ్చారు.

తాను కెసిఆర్ ను కలిసి తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం తెలిపినట్లు వసంత నాగేశ్వర్ రావు చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర సోదరులం ప్రశాంతంగా విడిపోవాలని, ఇరు ప్రాంతాల వారు సహోదరులుగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ఇరు ప్రాంతాలవారు సహోదర భావంతో ఉండాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X