వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు: అన్నవరం ఆలయం ప్రవేశ ద్వారం మార్పు

By Santaram
|
Google Oneindia TeluguNews

Annavaram Temple
అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న సత్యగిరిపై నిర్మితమవుతున్న డార్మిటరీ హాలు నిర్మాణానికి ఉపయో గిస్తున్న రాయి నాణ్యతపై దేవాదాయ శాఖ కమిషనర్‌ సుందరకుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణానికి ఉపయోగిస్తున్న రాయిలో గట్టిదనం లేదని భవిష్యత్తు లో ప్రమాదానికి దారి తీస్తుందని ఆయన అభిప్రా యపడ్డారు. సోమవారం సత్యగిరి అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడా రు.125 గదుల సత్రాన్ని 75 గదుల సత్రంగా మార్పు చేస్తున్నామని, భక్తుల అవసరాల దృష్ట్యా మరో రెండు కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పడమర ప్రవేశ ద్వారం మార్చి తూర్పు దిశగా మార్చాలని సూచించిన ట్లు తెలిపారు. ప్రస్తుతం దేవాలయాల ఆస్తులను 38 రిజిష్టర్‌ నుంచి 43 రిజిష్టర్‌లోనికి మార్పు చేస్తున్నా మని, దేవాలయాల ఆస్తులు, ఆదాయ వివరాలను అం దులో పొందుపరచనున్నట్లు తెలిపారు. ఆలయాల గ్రేడ్‌ ను బట్టి ఏడీసీ, జేసీ, డీసీలు పర్యవేక్షిస్తామన్నారు. రిజిష్టర్లు దేవాలయంలో ఒకటి, కమిషనర్‌ కార్యాలయంలో మరొకటి అందుబాటులో ఉంచుతా మన్నారు.

అన్నవరం దేవస్థానంపై వస్తున్న ఆరోపణల పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కళాశాలలో నియా మకం, ప్రమోషన్ల ప్రక్రియపై సమీక్షించనున్నట్లు చెప్పారు. కమిషనర్‌ ఆదేశాలను పక్కనపెట్టి అన్నవరంలో జరుగుతున్న తంతులో బాధ్యులపై చర్యలు తీసుకుం టున్నామన్నారు. దేవస్థానంలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామ న్నారు. ఎలక్ట్రికల్‌ విభాగంలో కొనుగోళ్ళపై నివేదిక పరి శీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X