వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ తో బలవంతంగా తినిపించండి: సింఘ్వీ

By Staff
|
Google Oneindia TeluguNews

Abhishek Singhvi
న్యూఢిల్లీ: బలవంతంగానైనా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఆహారం తినిపించాలని, తద్వారా కెసిఆర్ ను ప్రాణాపాయం నుంచి కాపాడాలని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. కెసిఆర్ తో ఆహారం తినిపించే విషయంలో వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. కెసిఆర్ తో దీక్ష విరమింపజేయడానికి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ సున్నితమైన అంశమని, దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదనే విషయం కెసిఆర్ కు కూడా తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణకు తక్షణ పరిష్కారం సాధ్యం కాదని ఆయన అన్నారు.

కాగా, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తెలంగాణలో పరిస్థితిపై కూడ ఆయన ఆరా తీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X