వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమిటీపై తెలంగాణ కాంగ్రెసు సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Congress Leaders
హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై చర్చించేందుకు కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు వెల్లడైన నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అనుకూలంగా ప్రతిస్పందించాలా, వ్యతిరేకంగా మాట్లాడాలా అనే విషయంపై తేల్చుకోవడానికి వారు ఇబ్బంది పడుతున్నారు. కాలపరిమితి విషయంలో వ్యతిరేకించడానికి ఏమీ లేకపోయినప్పటికీ విధివిధానాల విషయంలో మాత్రం తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఇరకాటంలో పడే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధివిధానాలు లేవనే అభిప్రాయం వెల్లడవుతున్న క్రమంలో ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. తెలంగాణ ప్రజలు విధివిధానాలను అంగీకరించే పరిస్థితిలో లేరు. దీంతో వారు అటు పార్టీ నిర్ణయాన్ని ఆమోదించలేక, ఇటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగలేక సతమతమయ్యే పరిస్థితి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X