వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్డ్ స్టోరేజీలో పెట్టారు: దత్తాత్రేయ

By Pratap
|
Google Oneindia TeluguNews

Bandaru Dattatreya
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని మరోమారు కోల్డ్ స్టోరేజీలో పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి విధించిన గడువును కూడా ఆయన వ్యతిరేకించారు. డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు విధించడం తెలంగాణ అంశాన్ని నీరు గార్చడానికేనని ఆయన అన్నారు. కమిటీ విధివిధానాలు తెలంగా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.

విధివిధానాలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి అభివృద్ధిని సమీక్షించడమనేది ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందని ఆయన అన్నారు. కమిటీ విధివిధానాలను బిజెపి తెలంగాణ నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు కూడా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కమిటీ విధివిధానాలున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X