వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు చెప్పడానికి కెసిఆర్ ఎవరు?: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: రాజీనామాలు చేయాలని చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎవరని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణపై కెసిఆర్ కన్నా తనకు ఎన్నో రెట్లు ఎక్కువ అభిమానం ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తాను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధివిధానాల ఖరారులో గౌరవపూర్వకంగా వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరినో మోసం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని వేయలేదని, సానుకూల దృక్పథంతో కేంద్ర ప్రభుత్వ చర్యను చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. కమిటీ విధివిధానాల్లో స్పష్టత ఉందని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ వల్ల అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని, కమిటీ నిష్పాక్షికంగా వ్యవహరించడానికి అందరూ సహకరించాలని ఆయన అన్నారు. కమిటీ ఏర్పాటు అవసరం ఎందుకు ఏర్పడిందనేది అందరూ అర్థం చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన చిదంబరం ప్రకటన చేసిన తర్వాత అంతకు ముందు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ పార్టీలు వ్యక్తం చేశాయని ఆయన అన్నారు. రెండు వైపుల నుంచి వేర్వేరు అభిప్రాయాలు వచ్చాయని ఆయన అన్నారు. సంప్రదింపులు జరిపి ఆ సమస్యను పరిష్కరించడానికే కమిటీ ఏర్పాటైందని ఆయన అన్నారు. సున్నితమైన అంశం కాబట్టే కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఒక ఫిక్షన్ అని ఆయన అన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X