వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాకు చెప్పడానికి కెసిఆర్ ఎవరు?: డిఎస్
శ్రీకృష్ణ కమిటీ వల్ల అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని, కమిటీ నిష్పాక్షికంగా వ్యవహరించడానికి అందరూ సహకరించాలని ఆయన అన్నారు. కమిటీ ఏర్పాటు అవసరం ఎందుకు ఏర్పడిందనేది అందరూ అర్థం చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన చిదంబరం ప్రకటన చేసిన తర్వాత అంతకు ముందు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ పార్టీలు వ్యక్తం చేశాయని ఆయన అన్నారు. రెండు వైపుల నుంచి వేర్వేరు అభిప్రాయాలు వచ్చాయని ఆయన అన్నారు. సంప్రదింపులు జరిపి ఆ సమస్యను పరిష్కరించడానికే కమిటీ ఏర్పాటైందని ఆయన అన్నారు. సున్నితమైన అంశం కాబట్టే కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఒక ఫిక్షన్ అని ఆయన అన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, February 12, 2010, 15:00 [IST]