వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధివిధానాలను వ్యతిరేకిస్తున్నాం: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrashekhar Rao
హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యతిరేకించారు. తాము శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను అంగీకరించబోమని ఆయన అన్నారు. కేంద్ర హోంశాఖ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ప్రకటించిన వెంటనే శుక్రవారం ఉదయం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కమిటీ విధివిధానాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మరోసారి వంచిందని ఆయన అన్నారు. విధివిధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యక్రమంపై చర్చించేందుకు తెరాస పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. పార్టీ ముఖ్య నేతలతో కెసిఆర్ తన నివాసంలో సమావేశమయ్యారు.

శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కూడా వ్యతిరేకించింది. కమిటీ విధివిధానాలను తెలంగాణ విమోచన సమితి నాయకుడు ప్రకాష్ కూడా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరిగే నష్టమేమిటనేది కమిటీ పరిశీలిస్తుందని అనుకున్నామని, కాని అందుకు భిన్నంగా కమిటీ విధివిధానాలున్నాయని ఆయన అన్నారు. కమిటీ పరిశీలనాంశాలను అధ్యయనం చేయడానికి మూడు నెలల కాలపరిమితి కూడా అవసరం లేదని, గణాంకాలన్నీ ఉన్నాయని, ఒక గంటలో వాటిని తాను కమిటీకి వివరించగలనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X