వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధివిధానాలు అనుకూలమే: సబిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
తిరుపతి/కరీంనగర్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలమేనని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను స్వాగతిస్తున్నట్లు ఆమె శుక్రవారం తిరుపతిలో అన్నారు. తెలంగాణకు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం న్యాయం చేస్తుందని ఆమె అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కల్లాకపటం లేకుండా వ్యవహరిస్తారని ఆమె అన్నారు. తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, వరంగల్ లను అర్బన్ పోలీసు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. అనంతరం ఆమె తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లారు.

కాగా, శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తాము వ్యతిరేకించడం లేదని, అలాగని స్వాగతించడం కూడా లేదని కరీంనగర్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. కమిటీ తెలంగాణను కాదన్నప్పుడు ఉద్యమంలో తామే ముందుంటామని ఆయన శుక్రవారం కరీంనగర్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. డెడ్ లైన్లతో తెలంగాణ రాదని, రాజీనామాలు సమస్య పరిష్కారానికి మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై పార్టీలో చర్చించిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X