వచ్చే వారం ఉయ్యూరు ఆర్టీసీ డిపోకు ప్రాణం
2006 తర్వాత జిల్లాలో గన్నవరం, ఉయ్యూరు డిపోలను నష్టాల బాటలో ఉన్నందున మూసివేశారు. డిపోను మూసివేసేనాటికి ఆ ఏడాది ఉత్తమ డిపోగా అవార్డును అందుకుంది. 47 ఆర్టీసీ, 26 అద్దె బస్సులు 336 ట్రిప్పులు నడిపేవారు. ఈ డిపో ఆపరేటింగ్ రేషియో 63 నుంచి 70 శాతం ఉండేది. గత ఎన్నికల ముందే వైఎస్ ఈ డిపోలను పునఃప్రారంభించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మొదట ఉయ్యూరు డిపోను ప్రారంభించనున్నారు. ఒక్కోడిపో నుంచి 60 నుంచి 70 సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్యూఆర్ఎం బస్సులు పెద్ద సంఖ్యలో నగరానికి రానుండటంతో వాటిని ఉపయోగించుకునేలా డిపోను ప్రారంభించనున్నారు.