వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

20 లక్షలతో పోతన స్మారక మందిరం

By Santaram
|
Google Oneindia TeluguNews

Pothana
పాలకుర్తి: కవులు బమ్మెర పోతన, పాల్కూరి సోమనాథుల స్మారక మందిరాల అభివృద్ధికి రూ.25 లక్షలతో త్వరలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పర్యటకశాఖ ఎస్టేట్‌ అధికారి కిషన్‌ తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖ ఎమ్‌డీ బుర్ర వెంకటేశం ఆదేశాల మేరకు మంగళవారం పాలకుర్తి, బమ్మెర గ్రామాల్లో సోమనాథుడు, పోతన స్మారక మందిరాలను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోతన మందిరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ. 20 లక్షలతో మినీ ఆడిటోరియం, గ్రంథాలయం, సంగీత కళాశాల, వేద పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. వీటి నిర్మాణానికి ఐదు ఎకరాల భూమి అవసరమని, గ్రామస్తులు సహకరించాలని కోరారు. పర్యాటకుల కోసం హోటల్‌, తాగునీటి సౌక ర్యం కల్పిస్తామన్నారు.

సోమనాథుడి సమాధి కోసం రూ.5 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఆయన వెంట పర్యాటక శాఖ డీజీఎం వెంకటేశ్వర్‌రావు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఉషారాణి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మజా, సీపీఓ సత్యనారాయణ, తహసిల్దార్‌ విజయ్‌కుమార్‌, ఆర్‌ఐ చంద్రశేఖర్‌, వీఆర్‌ఓ ఉప్పలయ్య, హుస్సేన్‌, పోతన సేవా సమితి సభ్యులు బత్తిని మదన్‌, సోమన్న పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X