వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజ్జూ కిడ్నాప్: బంధువుపైనే అనుమానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajju
అమలావురం: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం రాత్రి అపహరణకు గురైన అజ్జూ జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. అమలాపురంలోని గాంధీనగర్ కు చెందిన రెండేళ్ల అజ్జూ బుధవారం రాత్రి కిడ్నాప్ నకు గురయ్యాడు. బాలుడి కుటుంబానికి చెందిన సన్నిహిత బంధువులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అజ్జూ సమీప బంధువు కళ్యాణ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అజ్జూను క్షేమంగా వదిలిపెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వారు తమ కుమారుడి కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. కళ్యాణ్ కు ఫోన్ చేస్తే తనకు తెలియదంటూ చెప్పి ఆ తర్వాత స్విచాఫ్ చేసినట్లు చెబుతున్నారు. డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ నకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

కిడ్నాపర్లు బుధవారం రాత్రి అజ్జూ తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. కాగా, పోలీసులు రెండు సార్లు కిడ్నాపర్ల ఫోన్ కు చేసి మాట్లాడారు. అయితే ఆ తర్వాత కిడ్నాపర్లు సెల్ లు స్విచాఫ్ చేశారు. కళ్యాణ్ కిడ్నాప్ చేయలేదని, కావాలనే తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నారని కళ్యాణ్ తల్లి అంటోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X