వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అజ్జూ కిడ్నాప్: బంధువుపైనే అనుమానం
నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అజ్జూను క్షేమంగా వదిలిపెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వారు తమ కుమారుడి కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. కళ్యాణ్ కు ఫోన్ చేస్తే తనకు తెలియదంటూ చెప్పి ఆ తర్వాత స్విచాఫ్ చేసినట్లు చెబుతున్నారు. డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ నకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
కిడ్నాపర్లు బుధవారం రాత్రి అజ్జూ తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. కాగా, పోలీసులు రెండు సార్లు కిడ్నాపర్ల ఫోన్ కు చేసి మాట్లాడారు. అయితే ఆ తర్వాత కిడ్నాపర్లు సెల్ లు స్విచాఫ్ చేశారు. కళ్యాణ్ కిడ్నాప్ చేయలేదని, కావాలనే తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నారని కళ్యాణ్ తల్లి అంటోంది.
Comments
Story first published: Thursday, March 4, 2010, 11:14 [IST]