వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్వతీపురంలో బాలుడు అజ్జూ క్షేమం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajju
అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో గత రాత్రి కిడ్నాప్ అయిన రెండున్నరేళ్ల బాలుడు అర్జున్ అలియాస్ అజ్జూ క్షేమంగా ఉన్నాడు. అతను విజయనగరం జిల్లా పార్వతీపురంలో క్షేమంగా ఉన్నట్లు అమలాపురంలోని తల్లిదండ్రులకు సమాచారం అందింది. కిడ్నాపైన 22 గంటల తర్వాత అజ్జూ క్షేమంగా బయటపడ్డాడు. అతను పార్వతీపురం పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం అందింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో విచారణ జరిపిన తర్వాత పార్వతీపురం వైపు అజ్జూను తీసికెళ్లినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు అజ్జూ ఆచూకీని కనిపెట్టగలిగారు. అజ్జూను అతని మేనమామ కళ్యాణ్ కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. తల్లిదండ్రులతో అజ్జూను పోలీసులు మాట్లాడించారు. ఎవరు కిడ్నాప్ చేసింది, ఎందుకు కిడ్నాప్ చేసింది వంటి వివరాలు తెలియాల్సి ఉంది. కిడ్నాప్ ను ఛేదించిన తీరు కూడా తెలియాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X