వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబాను దర్శించుకున్న రతన్ టాటా

By Santaram
|
Google Oneindia TeluguNews

Ratan Tata
పుట్టపర్తి: ప్రముఖపారిశ్రామికవేత్త రతన్‌ టాటా సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన బుధవారం సాయంత్రం 4.35 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబై నుంచి పుట్టపర్తికి వచ్చారు. స్థానిక సత్యసాయి విమానాశ్రయంలో ఆయనకు ప్రశాంతి నిలయం ప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయం శాంతిభవన్‌కు చేరుకున్నారు. అనంతరం ఐదు గంటలకు సాయికుల్వంత్‌ సభామందిరానికి చేరుకున్నారు.

అక్కడ రెండుగంటల పాటు బాబాదర్శనార్థం వేచిచూశారు. ఏడు గంటలకు యజుర్వేద భవనం నుంచి సభామందిరానికి బాబా చేరుకుని దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రతన్‌టాటాను బాబా పలుకరించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని ఆశీస్సులు అందజేశారు. గురువారం ఉదయం తిరిగి బాబాను ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశముంది. ఆతర్వాత ఇక్కడి నుంచి ముంబై బయలుదేరి వెళతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X