వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషులు దౌర్జన్యాలు చేస్తారు: సుహాసిని

By Santaram
|
Google Oneindia TeluguNews

Suhasini
బెంగళూరు: పురుషులు ఎంత మంచి వారైనా ఏదో ఒక సమయంలో మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రముఖ సినీనటి సుహాసిని మణిరత్నం అన్నారు. గురువారం సాయంత్రం ఇక్కడ బెంగళూరు విశ్వవిద్యాలయం సెంట్రల్‌ కళాశాల సెనేట్‌ హాల్‌లో ఐద్వా నిర్వహించిన జాతీయ యువ వనితా సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూసినప్పుడు తనకు కోపం వస్తుందన్నారు.

'నేను మంచి వ్యక్తిని కాను. వివిధ ఆందోళనల్లో పాల్గొన్నందుకు పోలీసులు నాపై కేసులు నమోదు చేశారు' అని ఆమె చెప్పారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన పరిస్థితి ఆసన్నమైందన్నారు. దౌర్జన్యాలను ప్రతిఘటించడంతో పాటు సమానహక్కుల కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X