చిలుకూరు గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
చిలుకూరు ఆలయం అభివృద్ధికి నిధులను అడిగితే ఇవ్వటానికి ప్రతి శాఖామంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారన్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి నిధులను రాబట్టి హిమాయత్నగర్ నుంచి ఆలయం వరకు నాలుగులైన్ల రోడ్డు, బ్యాంకు, పార్కుల అభివృద్ధి, మ రిన్ని మూత్రశాలలు, మురుగునీటి పరిశుద్ధి కేంద్రం లాంటి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయిం చామన్నారు.
దేవాలయం వద్ద పార్కింగ్ ఏర్పాటుచేయుటకు అనుమతి కోరుతూ పూజారులు పెట్టుకున్న దరఖాస్తును పంచాయతీ తిరస్కరించిందని సర్పంచ్ తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదికప్రకారంగా జనసముదాయానికి వందమీటర్ల దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్నపార్కింగ్ అందుకు విరుద్ధంగా ఉన్నందున చట్టబద్దత కల్పించలేమని నోటీసు రూపంలో తెలిపామన్నారు.
దేవాలయ పరిసర ప్రదేశాలన్నీ గ్రామకంఠం పరిధిలోనివేనని పంచాయతీ మరో మారు తీర్మానించింది.ప్రతిసారి ఆలయ పూజారి సౌందరరాజన్ దేవాలయంతో పాటు పరిసరాలన్నీ ఆలయానికే చెందుతాయని, ఇ క్కడ పంచాయతీయే లేదని వాదిస్తూ పరువు తీస్తున్నారని ఇకముందు అలా చేస్తే సహించేదిలేదన్నారు. దేవాలయంతో పాటు పరిసరాలన్నీ చిలుకూరు పంచాయతీ అనుబంధగ్రామమైన దేవల్వెంకటాపూర్ పరిధిలోనే ఉన్న విషయాన్ని రికార్డుల ఆధారంగా తెలుసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.260కి వ్యతిరేకంగా దేవాలయంలో నడుస్తున్న పుస్తకాల వ్యాపారాలన్నీ వెంటనే తొలగించాలని గ్రామపంచాయతీ నోటీసు జారీ చేసింది. ఆలయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని నిబంధన ఉన్నా అందుకు విరుద్ధంగా పూజారే పుస్తకాల వ్యాపారం చేయటంతో మరిన్ని వ్యాపారాలు తోడయ్యాయన్నారు. వాటన్నింటినీ వెంటనే తొలగించాలంటూ దేవాదాయశాఖ అధికారులకూ లేఖ రాయాలని తీర్మానించారు.