హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాకేం కొమ్ములు మొలవలేదు: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదారబాద్: బడ్జెట్ పై సమాధానం తర్వాత శుక్రవారం తాను అర్థంతారంగా శాసనసభ నుంచి వెళ్లిపోయినట్లు వచ్చిన ఆరోపణపై తాను ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. తాను సభా నాయకుడిని కాదని ఆయన అన్నారు. శుక్రవారం తాను అర్థాంతరంగా సభ నుంచి వెళ్లిపోయినట్లు ప్రతిపక్షాలు సభలో దుమారం రేపడంతో ఆయన శనివారం శాసనసభలో వివరణ ఇచ్చారు. శాసన మండలిలో మాట్లాడాల్సి ఉన్నందుననే తాను శాసన మండలి నుంచి అలా వెళ్లిపోయానని, సమయాభావం వల్లనే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.

స్పీకర్, ఇతర సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతనే తాను వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, సభ్యులపై తనకు గౌరవం ఉందని ఆయన అన్నారు. సభలో సభ్యులందరినీ తాను గౌరవిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబుపై తనకు గౌరవం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని అయినందుకు తనకేమీ కొమ్ములు మొలవలేదని ఆయన అన్నారు. స్పీకర్ పట్ల అగౌరవంగా ప్రవర్తించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X