వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎఫ్ ఐఎ భవనంపై దాడి: పలువురు మృతి

|
Google Oneindia TeluguNews

FIA Building in Lahore
లాహోర్: పాకిస్తాన్ లోని లాహోర్ లో సోమవారం భారీ ఉగ్రవాద దాడి జరిగింది. లాహోర్ లోని ఫెడరల్ ఇన్వెస్టేగషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) భవనం వద్ద ఉగ్రవాదులు కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మరణించినట్లు ధ్రువీకరించారు. మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పలువురు గాయపడ్డారు.

ఈ సంఘటనలో భారీ విధ్వంసం జరిగింది. ఇటీవలి కాలంలో అదే అతి పెద్ద దాడి అని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు వచ్చాయి. ఎఫ్ఐఎ భవనానికి సమీపంలోని మోడల్ టవున్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని, సంఘటన స్వభావాన్ని, మరణాల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని పోలీసు అధికారి మొహమ్మద్ రియాజ్ చెప్పారు.

పేలుడు పదార్ధాలతో కూడిన కారను నడుపుకుంటూ వచ్చి ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎఫ్ఐఎ భవనం పాక్షికంగా దెబ్బ తిన్నది. సంఘటనా స్థలంలో ఇటుకల కుప్పలు, మెటల్ పడి ఉన్నాయి. సమీపంలోని భవనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఈ దాడికి పాల్పడిందెవరనేది తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X