భీమవరంలోనూ హైటెక్ వ్యభిచారం!
స్థానిక ఏఎస్ రావునగర్లోని ఒక అపార్ట్మెంట్లో మాధవి అనే మహిళ కుటుంబ నివాసం కోసం అని చెప్పి ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. ఆమె అక్కడ వ్యభిచారం నిర్వహిస్తోంది. తను ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి కోడలినని చెప్పుకుంటూ పోలీసుల సహకారంతోనే వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స మాచారం.
కాగా, స్థానికుల ఫిర్యాదు మేరకు భీమవరం పోలీసులు ఆదివారం రాత్రి ఈ ఫ్లాట్పై దాడి చేశారు. ఏడుగురు మహిళలను, ముగ్గురు విటులను వారు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు వారి అరెస్టు చూపలేదు. మాధవి అరెస్టు చూపడానికి పోలీసులు తటపటాయిస్తున్నారు. కేసు నమోదు కాకుండా భీమవరం పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.
Story first published: Monday, March 8, 2010, 17:40 [IST]